రచ్చ సినిమా తర్వాత రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.... ‘ఎవడు’ సినిమా ఫస్ట్ లుక్ ఫోటో మీకు పక్కన చూడొచ్చు. గతంలో కంటే హీరో రామ్ చరణ్ కాస్త బాడీ పెంచి, సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు. చరణ్ ఈ కొత్త గెటప్ ను చూసి చాలా మంది అభిమానులు వావ్.. సూపర్ గా ఉంది అంటున్నారు. టైటిలే ఇంత డిఫరెంట్ గా ఉంది అంటే...స్టోరీ కూడా మిస్టీరియస్ గా ఉంటుందేమో? అని అభిప్రాయ పడుతున్నారు. రామ్ చరణ్ సరసన సమంత లీడ్ రోల్ చేస్తుండగా....స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.


తొలి సారిగా చెర్రీ, బన్నీ కలిసి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బన్నీ నటించే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటాయంటున్నారు. బృందావనం ఫేం వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్ రచయితగా, చోటాకె నాయుడు     ఫొటొగ్రఫీ చేస్తున్నారు.